ఆ వాదనల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2022-09-19T22:40:06+05:30 IST
ఆ వాదనల్లో నిజం లేదు: ఏపీ ప్రభుత్వం
అమరావతి: ఫైనాన్స్ కమిషన్ నియమించకపోవడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏపీ హైకోర్టులో పిటిషన్ టీడీపీ నేత జీవీ రెడ్డి దాఖలు చేశారు. పిటిషనర్ తరపున గతంలో లాయర్ ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. ప్రభుత్వ అఫిడవిట్ కాపీని ఉమేష్ చంద్రకు ప్రభుత్వ న్యాయవాది అందజేశారు.5వ ఆర్థిక సంఘాన్ని 3 నెలల్లో నియమిస్తామని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నిధుల మళ్ళింపు జరుగుతుందన్న వాదనల్లో నిజం లేదన్న ప్రభుత్వం పేర్కొంది.