ఢిల్లీలో ఏపీ గవర్నర్ హరిచందన్ పర్యటన
ABN , First Publish Date - 2022-04-23T00:22:04+05:30 IST
ఢిల్లీలో ఏపీ గవర్నర్ హరిచందన్ పర్యటన
అమరావతి: ఢిల్లీలో ఏపీ గవర్నర్ హరిచందన్ పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు ప్రధాని మోదీతో ఏపీ గవర్నర్ భేటీకానున్నారు. శనివారం సాయంత్రం రాష్ట్రపతి కోవింద్తో గవర్నర్ హరిచందన్ సమావేశం అవుతారు. సోమవారం వరకూ ఢిల్లీలోనే గవర్నర్ హరిచందన్ ఉండనున్నారు. ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో గవర్నర్ హరిచందన్ పాల్గొననున్నారు.