గవర్నర్ను కలిసిన రైతు సంఘం నాయకులు
ABN , First Publish Date - 2022-11-28T16:32:21+05:30 IST
గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ (Vishwa Bhushan Harichandan) ను రైతు సంఘం నాయకులు కలిశారు.
విజయవాడ: గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ (Vishwa Bhushan Harichandan) ను రైతు సంఘం నాయకులు కలిశారు. రాష్ట్రంలో జరిగే భూ సర్వేలో అవకతవకలు ఉన్నాయని గవర్నర్కు వడ్డే శోభనాద్రీశ్వరరావు (Vadde Sobhanadreeswara Rao, కేశవరావు, నాగేశ్వరరావు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో రైతులను సంప్రదించకుండానే సర్వేలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వీఆర్వోలకు ఈ సర్వేలపై అవగాహన లేదని వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. పాత రికార్డులు రద్దు చేసి కొత్తగా డిజిటల్ రికార్డులు తయారు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరపాలని, రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు.