సమ్మె వల్ల లాభం లేదు: సీఎస్ సమీర్శర్మ
ABN , First Publish Date - 2022-02-01T23:51:06+05:30 IST
ఉద్యోగుల సమ్మె వల్ల నష్టమే తప్ప లాభం లేదని సీఎస్
అమరావతి: ఉద్యోగుల సమ్మె వల్ల నష్టమే తప్ప లాభం లేదని సీఎస్ సమీర్శర్మ స్పష్టం చేశారు. సమ్మె వద్దని ఉద్యోగులను కోరుతున్నామన్నారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పరిస్థితిని చేజారిపోకుండా చూడాలన్నారు. ఏం చేయగలమో అంతా చేయండని సీఎం చెబుతున్నారని ఆయన తెలిపారు. వేతనాలు కచ్చితంగా పెరుగుతాయని, అపోహలు వద్దన్నారు. ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని, వారి సందేహాలు తీర్చుతామని రావత్ పేర్కొన్నారు.