Jagan's tribute to YSR: నేటికీ నాన్న చిరునవ్వు, జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి
ABN , First Publish Date - 2022-09-02T14:53:47+05:30 IST
దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్లో నివాళి అర్పిస్తూ... వైఎస్సార్ను స్మరించుకున్నారు.
అమరావతి: దివంగత నేత, మాజీ మంత్రి వైఎస్సార్ (YS Rajashekar reddy) వర్ధంతి సందర్భంగా ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి (AP CM) జగన్ మోహన్ రెడ్డి (Jagan mohan reddy) ట్విట్టర్లో నివాళి అర్పిస్తూ... వైఎస్సార్ (YSR)ను స్మరించుకున్నారు. ‘‘నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి... ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.