AP Assembly : నువ్వు దళితుడివే అయితే.. దళితుడికే పుడితే అంటూ రెచ్చిపోయిన మంత్రి

ABN , First Publish Date - 2022-09-15T16:21:43+05:30 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభం అయ్యీ అవగానే సభలో గందరగోళం నెలకొంది.

AP Assembly : నువ్వు దళితుడివే అయితే.. దళితుడికే పుడితే అంటూ రెచ్చిపోయిన మంత్రి

AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రారంభం అయ్యీ అవగానే సభలో గందరగోళం నెలకొంది. ఇక ప్రశ్నోత్తరాల సమయం(Question hour)లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. స్టడీ సర్కిల్(Study Circle) విషయంలో.. మంత్రి మెరుగ నాగార్జున(Meruga Nagarjuna) సమాధానం చెపుతున్నప్పుడు టీడీపీ సభ్యులు(TDP MLAs) ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి నాగార్జున తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి(MLA Bala Veeranjaneya Swamy)పై మంత్రి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. నువ్వు దళితుడివైతే, దళితులకు పుడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu బంధనాల నుంచి బయటకు రావాలంటూ మంత్రి నాగార్జున రెచ్చిపోయారు. దీంతో అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చోటు చేసుకుంది.


ఏపీ అసెంబ్లీ (AP Assembly session) సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం (AP Government)జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందంటూ టీడీపీ (TDP) ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం (Tammineni sitaram) తిరస్కరించారు. దీంతో శాసనసభలో టీడీపీ సభ్యులు (TDP MLAs) ఆందోళనకు దిగారు. వాయిదా తీర్మానాలపై చర్చకు టీడీపీ సభ్యులు (TDp Leaders) పట్టుబట్టారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. 

Updated Date - 2022-09-15T16:21:43+05:30 IST