ఎయిడెడ్పై స్పష్టత ఏదీ?: టీచర్స్ గిల్డ్
ABN , First Publish Date - 2022-08-16T08:06:55+05:30 IST
నూతన హాజరు యాప్ ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయిందని ఏపీ టీచర్స్ గిల్డ్ నేత సీహెచ్.ప్రభాకర్ రెడ్డి అన్నారు.
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నూతన హాజరు యాప్ ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుందా? లేదా? అనే దానిపై స్పష్టత లేకుండా పోయిందని ఏపీ టీచర్స్ గిల్డ్ నేత సీహెచ్.ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎయిడెడ్ పాఠశాలల్లో 3,015 మంది టీచర్లు పనిచేస్తున్నారని, చాలా చోట్ల ఎంఈవోలు ఇంతవరకూ వారి వివరాలను కొత్త యాప్లో నమోదు చేయలేదని తెలిపారు. దీంతో ముఖ ఆధారిత హాజరు తమకు ఉందో లేదోనని ఎయిడెడ్ టీచర్లు ఆందోళన చెందుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ప్రభాకర్రెడ్డి కోరారు.