AP: ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ABN , First Publish Date - 2022-01-01T15:22:38+05:30 IST
నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంది.
విజయవాడ: నూతన సంవత్సరం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ అధికంగా ఉంది. కొత్త సంవత్సరం అమ్మవారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. కోవిడ్ నిర్మూలన అయి అందరికి మంచి జరగాలని భక్తులు కోరుకుంటున్నారు.