Andhra news: ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ
ABN , First Publish Date - 2022-07-21T15:15:34+05:30 IST
ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కు నిరసన సెగ తగిలింది.
కోనసీమ: ముమ్మిడివరం వైసీపీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్(Ponnada satish)కు నిరసన సెగ తగిలింది. తిండి..తాగు నీరు అందడం లేదని వరద బాధితులు(Flood victims) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మిడివరం మండలం కమిని గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తమకు ఏ సహయం సరిగా అందలేదని బాధితులు మండిపడ్డారు. వరద భారీగా వచ్చినా పడవలు లేవని, మూడురోజులు అవుతున్నా తిండి, నీరు లేదని ఎమ్మెల్యేపై వరద బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.