Andhra Jyothi, పవన్పై మళ్లీ అక్కసు వెళ్లగక్కిన జగన్
ABN , First Publish Date - 2022-05-17T01:52:29+05:30 IST
ఆంధ్రజ్యోతి (Andhra Jyothi) జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)పై సీఎం జగన్ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు
ఏలూరు: ఆంధ్రజ్యోతి (Andhra Jyothi), జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan)పై సీఎం జగన్ మళ్లీ అక్కసు వెళ్లగక్కారు. వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం 2022 తొలి విడత నగదు బదిలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణపవరంలో వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం 2022 తొలి విడత నగదు బదిలీ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘మూడేళ్లగా పారదర్శక పాలన అందిస్తున్నా, ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 వంటి కొన్ని మీడియాలు నామీద బురద చల్లుతున్నాయి. దుష్ప్రచారం చేస్తున్నాయి. నా పాలన గురించి ఏరోజూ ఆ మీడియా చెప్పదు. చూపించదు. చంద్రబాబునాయుడు ఆ రోజుల్లో మోసం చేస్తే ప్రశ్నించలేదు. ఈ రోజు నన్ను ప్రశ్నిస్తున్నారు’’ అని ఆయన తన ఆక్రోశం వెళ్లగక్కారు.
జనసేన అధినేత పవన్ను ఉద్దేశించి జగన్ మరోసారి విమర్శించారు. ‘‘చంద్రబాబు (Chandrababu) దత్తపుత్రుడైన ఓ పెద్దమనిషి రైతుల పరామర్శకు బయల్దేరాడు. ఆ పరామర్శలో పట్టాదారు పాస్ పుస్తకం ఉండి, రూ.7 లక్షలు నష్టపరిహారం దక్కని ఒక్క కుటుంబాన్ని చూపించలేకపోయాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా దత్తపుత్రుడు బాధ్యత లేకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు ప్రశ్నిస్తున్నానని చెప్పుకుంటోన్న ఆ దత్తపుత్రుడు అపుడు ఎందుకు ప్రశ్నించలేదు’’ అని జగన్ విమర్శించారు. వ్యవసాయం గురించి తమ ప్రభుత్వం ఏమి చేసిందో, గత ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలందరికీ తెలుసునని, గత-ప్రస్తుత పాలనకు తేడా గుర్తించండి అంటూ జగన్ తన ప్రసంగంలో ప్రజలను అడిగారు.