తహసీల్దార్ ఆత్మహత్యపై విచారణ జరపాలి
ABN , First Publish Date - 2022-12-10T02:35:33+05:30 IST
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య.. తీవ్ర ద్రిగ్బాంతికి, ఆవేదనకు గురి చే సిందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి.ఎ్స.దివాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రెవెన్యూ ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించండి: ఏపీ రెవెన్యూ జేఏసీ
ఽవిజయవాడ (ధర్నాచౌక్), డిసెంబరు 9: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు తహసీల్దార్ శ్రీనివాసరావు ఆత్మహత్య.. తీవ్ర ద్రిగ్బాంతికి, ఆవేదనకు గురి చే సిందని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జేఏసీ చైర్మన్ వి.ఎ్స.దివాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల పాడేరులో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో తహసీల్దార్పై ప్రాజెక్టు అధికారి దుర్భాషలాడి అవమానించారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అధికారులను ప్రాసిక్యూట్ చేయాలని, కఠినంగా శిక్షించాలన్నారు. ప్రభుత్వం వెంటనే సమీక్ష జరిపి రీసర్వేకు ఆఫీసు సబార్డినేట్ నుంచి డిప్యూటీ కలెక్టర్ల వరకు రీసర్వే పోస్టులు ప్రత్యేకంగా ఏర్పాటుచేసి అన్ని తరగతుల సిబ్బందికి పదోన్నతులు కల్పించాలని దివాకర్ డిమాండ్ చేశారు.