అంబేద్కర్ పేరు పెట్టడాన్ని వివాదాస్పదం చేస్తున్న ప్రతిపక్షాలు: రోజా
ABN , First Publish Date - 2022-05-26T00:08:28+05:30 IST
అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయని మంత్రి రోజా దుయ్యబట్టారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయని మంత్రి రోజా దుయ్యబట్టారు. బుధవారం రోజా మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ పేరు పెట్టడాన్ని ప్రతిపక్షాలే ఒప్పుకున్నాయని గుర్తుచేశారు. సూసైడ్ చేసుకుంటానన్న వ్యక్తి జనసేన వాడేనని వెల్లడించారు. అమలాపురం ఘర్షణలో ఇప్పటివరకు దాదాపు 60 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ చదివారని రోజా ఎద్దేవాచేశారు.