అమలాపురంలో విధ్వంసం.. మరో 26 మంది అరెస్ట్
ABN , First Publish Date - 2022-05-28T23:16:58+05:30 IST
అమలాపురంలో విధ్వంసం ఘటనలో మరో 26 మందిని అరెస్ట్ చేశారు. బస్సుల దహనం,పోలీసులపై..
కోనసీమ: అమలాపురంలో విధ్వంసం ఘటనలో మరో 26 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బస్సుల దహనం, పోలీసులపై రాళ్లు రువ్వడం, మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టిన ఘటనలో పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. మొత్తం 46 మందిని గుర్తించిన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మరికొంతమందిని అరెస్ట్ చేశారు. అలాగే అమలాపురంలో మరో వారం పాటు 144 సెక్షన్ పొడిగించారు. వరుసగా 5వ రోజు ఆదివారం కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.