పోలవరం సందర్శనకు అనుమతివ్వండి

ABN , First Publish Date - 2022-12-19T02:46:35+05:30 IST

పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు.

పోలవరం సందర్శనకు అనుమతివ్వండి

సీఎం జగన్‌కు గిడుగు రుద్రరాజు లేఖ

న్యూఢిల్లీ, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన ఆదివారం రెండు పేజీల లేఖను సీఎంకు రాశారు. దీనిపై ఆయన ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘పోలవరం ప్రాజెక్టు రాష్ర్టానికి జీవధారం. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో విపరీత జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్టును కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, నిపుణుల బృందం జనవరి మొదటి వారంలో సందర్శిస్తుంది. దీనిలో ఎటువంటి రాజకీయం లేదు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ పూర్తిగా విఫలమయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదే’’ అన్నారు.

Updated Date - 2022-12-19T02:46:36+05:30 IST