Tirumala padayatra: 300 సార్లు కాలినడకన తిరుమలకు

ABN , First Publish Date - 2022-11-09T03:43:48+05:30 IST

300 సార్లు కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నాడో హైదరాబాద్‌ వాసి. శ్రీఅష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌ వేణుకుమార్‌ చుక్కల 1996 నుంచి కాలినడకన తిరుమలకు వస్తున్నారు.

Tirumala padayatra: 300 సార్లు కాలినడకన తిరుమలకు

సోపాన పాదయాత్రతో భక్తి చాటుకున్న హైదరాబాద్‌ వాసి

తిరుమల, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): 300 సార్లు కాలినడకన తిరుమల కొండెక్కి శ్రీవారిపై తన భక్తిని చాటుకున్నాడో హైదరాబాద్‌ వాసి. శ్రీఅష్టోత్తర శత చుక్కల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండర్‌ వేణుకుమార్‌ చుక్కల 1996 నుంచి కాలినడకన తిరుమలకు వస్తున్నారు. తిరుమల వేంకటేశ్వరస్వామి వైభవాన్ని చాటిచెప్పేందుకు సోపాన పాదయాత్ర నిర్వహిస్తున్నారు. జీవితంలో ఒక్కసారి కూడా తిరుమలకు కొండకు రాని పేదవర్గాల వారిని, అంధులను, దివ్యాంగులను, వృద్ధులను బృందంగా ఏర్పాటు చేసి తిరుమలకు తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఆయన 11మంది భక్తులతో శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు. 1008 సార్లు తిరుమలకు పాదయాత్రగా రావడంతో పాటు వేంకటేశ్వరస్వామి, తిరుమల వైభవాన్ని వీలైనంతమందికి తెలియజేయడమే తన లక్ష్యమని వేణు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2022-11-09T03:43:49+05:30 IST