పిన్ని
ABN , First Publish Date - 2021-01-09T16:12:13+05:30 IST
గోధుమపిండి - పావుకేజీ, నెయ్యి - 250 గ్రాములు, పంచదార - పావుకేజీ, పాలు - అరకప్పు, యాలకుల పొడి - 15 గ్రాములు, జీడిపప్పు - 25గ్రాములు, బాదం - 25 గ్రాములు
పండుగ రోజుల్లో పంజాబీలు చేసుకునే వంటకం ఇది.
కావలసినవి: గోధుమపిండి - పావుకేజీ, నెయ్యి - 250 గ్రాములు, పంచదార - పావుకేజీ, పాలు - అరకప్పు, యాలకుల పొడి - 15 గ్రాములు, జీడిపప్పు - 25గ్రాములు, బాదం - 25 గ్రాములు, ఎండుద్రాక్ష - 25 గ్రాములు.
తయారీ విధానం: స్టవ్పై మందపాటి పాన్ పెట్టి నెయ్యి వేసి వేడి చేయాలి. తరువాత గోధుమపిండి వేసి వేగించాలి. తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చాలి. పంచదార, యాలకుల పొడి, పాలు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బంతుల్లా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి.