మ్యాంగో ఫిర్ని
ABN , First Publish Date - 2021-06-19T16:59:12+05:30 IST
బియ్యం - 150గ్రా, పంచదార - 200గ్రా, పాలు - 500ఎంఎల్, యాలకులు - 10గ్రా, మామిడిపండు గుజ్జు - 100గ్రా, బాదంపలుకులు - 25గ్రా.
కావలసినవి: బియ్యం - 150గ్రా, పంచదార - 200గ్రా, పాలు - 500ఎంఎల్, యాలకులు - 10గ్రా, మామిడిపండు గుజ్జు - 100గ్రా, బాదంపలుకులు - 25గ్రా.
తయారీ విధానం: ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో వేసి కొద్దిగా గ్రైండ్ చేయాలి. స్టవ్పై పాన్పెట్టి పాలు పోసి, యాలకుల పొడి వేసి మరిగించాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం వేయాలి. చిన్నమంటపై అరగంటపాటు ఉడికించాలి. బియ్యం ఉడికిన తరువాత పంచదార వేసి కలపాలి. స్టవ్పై నుంచి దింపి చల్లారిన తరువాత మామిడిపండు గుజ్జు వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. ఫ్రిజ్లో అరగంటపాటు పెట్టాలి. బాదంపలుకులతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కూల్ మ్యాంగో ఫిర్ని టేస్ట్ చేస్తే మీ జిహ్వచాపల్యం తీరుతుంది.
సి. రామకృష్ణారెడ్డి
సూ చెఫ్
గోల్కొండ రిసార్ట్స్ అండ్ స్పా, హైదరాబాద్
ఫోన్: 9110726536