ఆరు గంటలు ధర్నా చేసి.. వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలి: షర్మిల
ABN , First Publish Date - 2021-11-21T08:34:51+05:30 IST
మూడుగంటల ధర్నా చేసి రైతు చట్టాలను రద్దు చేయుంచామని జబ్బలు చరుచుకొంటున్న సీఎం కేసీఆర్.. ఆరు గంటలు ధర్నా చేసి రైతుల

హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): మూడుగంటల ధర్నా చేసి రైతు చట్టాలను రద్దు చేయుంచామని జబ్బలు చరుచుకొంటున్న సీఎం కేసీఆర్.. ఆరు గంటలు ధర్నా చేసి రైతుల వడ్లన్నీ కేంద్రం కొనేలా చేయాలని సీఎం కేసీఆర్కు వైఎ్సఆర్టీపీ అధినేత్రి షర్మిల సవాల్ విసిరారు. మంచి జరిగితే ఆయన అకౌంట్లో.. లేకుంటే పక్కోడిపైన వేయడం కేసీఆర్కు అలవాటేనంటూ శనివారం ఆమె ట్వీట్ చేశారు.