వరి వేసుకోకపోతే ఉరి వేసుకోవాలా?: షర్మిల
ABN , First Publish Date - 2021-11-01T00:32:35+05:30 IST
రాష్ట్రంలోని రైతులు వరి వేసుకోకపోతే ఉరి వేసుకోవాలా అని ప్రభుత్వాన్ని
నల్గొండ: రాష్ట్రంలోని రైతులు వరి వేసుకోకపోతే ఉరి వేసుకోవాలా అని ప్రభుత్వాన్ని వైఎస్సాఆర్టీపీ అధినేత షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సర్కారు తీరుపై షర్మిల మండిపడ్డారు. కేసీర్ చేతుల్లో వ్యవసాయం బందీ అయ్యిందన్నారు. వేల కోట్ల కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేస్తున్నారని షర్మిల ఆరోపించారు.