షర్మిల సభలో వైఎస్ విజయలక్ష్మి భావోద్వేగం
ABN , First Publish Date - 2021-04-10T02:04:56+05:30 IST
వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంకల్ప సభలో వైఎస్ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్రెడ్డిని
ఖమ్మం: వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంకల్ప సభలో వైఎస్ విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. దివంగత మాజీ సీఎం రాజశేఖర్రెడ్డిని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. 18 ఏళ్ల కిందట ఇదే రోజున తెలంగాణలో చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరుతో వైఎస్ఆర్ పాదయాత్ర చేపట్టారని గుర్తుచేశారు. రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు ఖమ్మం నుంచి షర్మిల వేయడం అభినందనీయమని కొనియాడారు. రాజన్న బిడ్డ పార్టీ పెడుతుంటే వస్తున్న అభినందనల వెల్లువ చెప్పలేనిదన్నారు. వైఎస్ను గుండెల్లో పెట్టుకున్న ప్రజలందరికీ రుణపడి ఉంటానని చెప్పారు. వైఎస్ కోసం చనిపోయినవారిలో తెలంగాణవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు.
‘‘నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం.. నేను, నా కుటుంబం రుణపడి ఉంటాం. మనుషుల్లో తేడాలెందుకన్న భావన వైఎస్ఆర్ది. అందరినీ అక్కున చేర్చుకున్న మహనీయుడు వైఎస్ఆర్. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు. ఎలా బతికామన్న కాంక్షను షర్మిలకు వైఎస్ఆర్ నేర్పించారు’’ అని విజయలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు.