3 రోజుల పాటు హైదరాబాద్లో నిరాహారదీక్ష: షర్మిల
ABN , First Publish Date - 2021-04-14T18:19:52+05:30 IST
3 రోజుల పాటు హైదరాబాద్లో నిరాహారదీక్ష: షర్మిల
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ఆందోళనలు చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు. ఈ నెల 15 నుంచి నిరాహారదీక్షలు చేయబోతున్నామన్నిరు. 3 రోజుల పాటు హైదరాబాద్లో నిరాహారదీక్షకు దిగుతాతని తెలిపారు. నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే వరకు దీక్షలు ఆగవన్నారు. కాగా షర్మిల నిరాహార దీక్షకు ఒక రోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 10 నుంచి 5 వరకు మాత్రమే పోలీసులు ఇందిరా పార్క్లో దీక్షకు అనుమతి ఇచ్చారు.