మార్ఫింగ్ ఫొటోలతో వేధిస్తున్న యువకుడిపై కేసు
ABN , First Publish Date - 2021-01-22T05:39:46+05:30 IST
మార్ఫింగ్ ఫొటోలతో వేధిస్తున్న యువకుడిపై కేసు
మట్టెవాడ(వరంగల్), జనవరి 21: మహిళల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్న యువకుడిపై మిల్స్కాలనీ పోలీసులు కేసు నమోదుచేశారు. మిల్స్కాలనీ సీఐ రవికిరణ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. కరీమాబాద్ ప్రాంతానికి చెందిన ఉప్పుల హరిశంకర్ అనే యువకుడు కొంతకాలంగా మహిళలు, పురుషుల ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అలాగే, హరిశంకర్ తమ బంధువుపై దాడి చేసిన ఘటనకు సంబంధించి గతంలో కూడా కేసు నమోదైందని తెలిపారు.