రుణం కోసం వెళ్తే అంధుడిని గెంటేశారు!

ABN , First Publish Date - 2021-08-10T07:36:08+05:30 IST

రుణం అడిగేందుకు వెళ్లిన తనను అంధుడినని కూడా చూడకుండా అధికారులు అమానుషంగా వ్యవహరించారంటూ కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు దేవునూరి వీరయ్య

రుణం కోసం వెళ్తే అంధుడిని గెంటేశారు!

మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట డప్పు వాయిస్తూ నిరసన 


శంకరపట్నం, ఆగస్టు 9: రుణం అడిగేందుకు వెళ్లిన తనను అంధుడినని కూడా చూడకుండా అధికారులు అమానుషంగా వ్యవహరించారంటూ కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌కు దేవునూరి వీరయ్య సోమవారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టి, డప్పు వాయిస్తూ నిరసన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం, వారి ఆర్థిక ఎదుగుదల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవి సక్రమంగా అమలు కావడం లేదని ఈ సందర్భంగా వీరయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు రెండు కళ్లు కనబడవని, బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకొని, బ్యాంకు అధికారుల ఆమోద పత్రాన్ని కరీంనగర్‌లోని వికలాంగుల సంక్షేమ శాఖాధికారికి 2017 డిసెంబరులో అందజేశానన్నారు. అప్పటి నుంచి తనకు రుణం ఇవ్వలేదని, వికలాంగుల సంక్షేమశాఖాధికారి జిల్లా ఏడీ వద్దకు వెళ్తే అంధుడు అని చూడకుండా బయటకు గెంటేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. 

Updated Date - 2021-08-10T07:36:08+05:30 IST