ప్రగతి భవన్‌పై నీలి జెండా ఎగరేస్తాం

ABN , First Publish Date - 2021-12-13T08:35:34+05:30 IST

ప్రగతి భవన్‌పై నీలి జెండా ఎగరేస్తామని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

ప్రగతి భవన్‌పై నీలి జెండా ఎగరేస్తాం

బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ 

కోదాడ, డిసెంబరు 12: ప్రగతి భవన్‌పై నీలి జెండా ఎగరేస్తామని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి నీలి కండువే శ్రీకాంతాచారి రూపంలో నిలిచిందన్నారు. శ్రీకాంతాచారి బహుజనుడని, రాష్ట్ర సాధన కోసం అమరుడయ్యారని తెలిపారు. నీలి కండువా రాకతోనే 30 లక్షల మందికి ఉపాధి దొరికిందని అన్నారు. బీఎస్పీతోనే అన్ని కులాలు, మతాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. జనాభా నిష్పత్తి ప్రకారం బహుజనులకు అభివృద్ధి ఫలాలు దక్కేలా పార్టీ కృషి చేస్తుందన్నారు. ఏనుగు గుర్తును అన్ని వర్గాలకు చేరువచేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం డివిజన్‌ పరిధిలోని పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రవీణ్‌ కుమార్‌ సమక్షంలో పార్టీలో చేరారు.

Updated Date - 2021-12-13T08:35:34+05:30 IST