వరంగల్ కోటలో సందర్శకులకు ప్రవేశాలు బంద్
ABN , First Publish Date - 2021-04-17T06:01:00+05:30 IST
వరంగల్ కోటలో సందర్శకులకు ప్రవేశాలు బంద్
ఖిలావరంగల్, ఏప్రిల్ 16: కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర పురావస్తు శాఖ చారిత్రక ప్రదేశాలను మూసి వేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఖిలావరంగల్ కోటను కూడా శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్టు, పర్యాటకులు ఈ విషయాలను గమనించి ఎవరూ రావద్దని పురావస్తు శాఖ అధికారి మల్లేశం ఒక ప్రకటనలో కోరారు.