గాంధీలో నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలు రెట్టింపు చేయాలి: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-05-20T09:13:23+05:30 IST
గాంధీ ఆస్పత్రిలో కరోనా సేవలందిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలను రూ. 8 వేల నుంచి రూ. 16 వేలకు పెంచాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు.

హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): గాంధీ ఆస్పత్రిలో కరోనా సేవలందిస్తున్న నాలుగో తరగతి ఉద్యోగుల వేతనాలను రూ. 8 వేల నుంచి రూ. 16 వేలకు పెంచాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. వైద్యులు, సిబ్బందికి గతంలో ఇస్తానన్న 10ు ఇన్సెంటివ్ ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ గాంధీ ఆస్పత్రి పర్యటన.. మరో ఉస్మానియా పర్యటనలా మిగిలిపోవద్దని బుధవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.