కేసీఆర్.. ఈ దొంగ ధర్నా ఎందుకు: విజయశాంతి
ABN , First Publish Date - 2021-11-18T22:36:53+05:30 IST
దేశంలో ఎక్కడాలేని సమస్య కేసీఆర్కే ఎందుకు వచ్చిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ తప్ప బియ్యం కొంటామని ...
హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని సమస్య కేసీఆర్కే ఎందుకు వచ్చిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్ తప్ప బియ్యం కొంటామని కేంద్రం చెబుతున్నా కేసీఆర్కు ఈ మోసాల ధర్నా ఎందుకు చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్ల నుంచి వేల కోట్ల కమీషన్లు తీసుకుని కేసీఆర్ బాయిల్డ్ రైస్కే పట్టుబడుతున్నారన్నారు. రోడ్ల మీద తడిసిపాడవుతున్న ధాన్యం కొనుగోలు చేయక రైతులను గోస పెట్టిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే యాసంగి గురించి ఈ దొంగ ధర్నా ఎందుకు అని విజయశాంతి ప్రశ్నించారు. ఇదే అంశంపై విజయశాంతి సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో స్పందించారు.