వెంకయ్య రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా: చిరంజీవి
ABN , First Publish Date - 2021-11-18T00:02:24+05:30 IST
నగరంలోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు.
హైదరాబాద్: నగరంలోని లాల్ బంగ్లాలో యోధ లైఫ్లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్ను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అయ్యప్ప సాక్షిగా వెంకయ్యనాయుడు రాష్ట్రపతి కావాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు చేస్తున్న సేవలు అనిర్వచనీయమని చిరంజీవి కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా నా స్వంత వనరులతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ను నడుతున్నానని తెలిపారు. సినిమా రంగంలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న పేద కళాకారులకు లైఫ్లైన్ డయోగ్నస్టిక్స్ సెంటర్లో పరీక్షలు చేయించుకుంటే వారికి వెసులుబాటు ఇవ్వాలని నిర్వాహకులను చిరంజీవి కోరారు.