రాజన్న హుండీ ఆదాయం కోటి 25 లక్షలు

ABN , First Publish Date - 2021-08-27T12:13:18+05:30 IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా కోటి 25 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. గత 21 రోజుల వ్యవధిలో భక్తులు

రాజన్న హుండీ ఆదాయం కోటి 25 లక్షలు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఖజానాకు హుండీ ద్వారా కోటి 25 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. గత 21 రోజుల వ్యవధిలో భక్తులు శ్రీస్వామివారి హుండీల్లో సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో గురువారం లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 25 లక్షల 53 వేల 467 రూపాయల నగదు, 226 గ్రాముల బంగారం, 8 కిలోల 500 గ్రాముల వెండి లభించిందని ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఆలయ అధికారులు, సిబ్బంది, వలంటీర్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-27T12:13:18+05:30 IST