వ్యాక్సినేషన్ ఎందుకు ఆపారు: బండి సంజయ్
ABN , First Publish Date - 2021-05-20T23:42:45+05:30 IST
వ్యాక్సినేషన్ ఎందుకు ఆపారని బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
హైదరాబాద్: వ్యాక్సినేషన్ ఎందుకు ఆపారని బీజేపీ నేత బండి సంజయ్ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఎందుకు వ్యాక్సిన్ ఆపేశారు? అని ప్రశ్నించారు. గాంధీ ఆస్పత్రికి వెళ్లి సీఎం కేసీఆర్ ఏం సాధించారని నిలదీశారు. కొవిడ్ టాస్క్ఫోర్స్ ఓ దొంగల ముఠా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్ గాంధీ ఆసుపత్రికి ఒక్కసారి వెళ్తే కేంద్ర సహాయమంత్రి కిషన్రెడ్డి ఏడు సార్లు వెళ్లి వచ్చారని తెలిపారు. వరంగల్ ఎంజీఎంకు ఈరోజే ఎందుకు వెళ్లడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.