చిరునవ్వుతో వైద్యం.. రోగులకు సంతోషం
ABN , First Publish Date - 2021-08-01T09:16:45+05:30 IST
మానసిక అనారోగ్య సమస్యలపై ప్రజ ల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నా రు. ఈ అవగాహన
మానసిక అనారోగ్యంపై అవగాహన పెరగాలి: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్, మేడ్చల్, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : మానసిక అనారోగ్య సమస్యలపై ప్రజ ల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నా రు. ఈ అవగాహన లేకే చాలా మంది మానసిక రోగులు, వారి కుటుంబసభ్యులు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, తెలంగాణ శాఖ(టీఎస్పీఎ్సవైసీఓఎన్-2021) 7వ సమావేశాన్ని శని వారం ఆమె రాజ్భవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. మానసిక అనారోగ్యాన్ని త్వరితగతిన నిర్ధారించి, తగిన ట్రీట్మెంట్ ఇప్పించాలన్నా రు. ప్రతి ఆరుగురు భారతీయుల్లో ఒకరు మానసిక ఆరోగ్యంపై సహాయం కోరుతుండడం నిజంగా ఆందోళనకరమన్నారు. ఇలాంటి మానసిక అనారో గ్య సమస్యలపై 2012 నుంచి 2030 వరకు భారత్ దాదాపు 1.3 ట్రిలియన్ డాలర్లను వ్యయం చేస్తుందన్నారు.
వైద్యులు చిరునవ్వుతో వైద్య సేవలు అం దిస్తే రోగులు సంతోషిస్తారని మేడ్చల్ జిల్లా ఘణాపూర్లోని మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కళాశాల విద్యార్థులకు గవర్నర్ ఉద్బోధించారు. కళాశాల స్నాతకోత్సవంలో ఆమె ముఖ్య అతిఽథిగా పాల్గొని విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, డాక్టరేట్ పట్టాలను అందజేశారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ..వైద్యులు నిరుపేదలకు సేవాదృక్పథం తో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.