వారణాసిలో రెండో ‌రోజు కవిత, కుటుంబసభ్యుల పర్యటన

ABN , First Publish Date - 2021-01-29T15:06:42+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని..

వారణాసిలో రెండో ‌రోజు కవిత, కుటుంబసభ్యుల పర్యటన

ఉత్తరప్రదేశ్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం వారణాసిలో రెండో ‌రోజు పర్యటిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ‌దర్శించుకున్నారు. ఈ సందర్బంగా అన్నపూర్ణ దేవాలయంలో అన్నపూర్ణదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత దుందిరాజ్ ఆలయంలో ప్రత్యేక గణేష్ పూజలో పాల్గొన్నారు. అనంతరం వారు వరాహి దేవాలయాన్ని దర్శించుకున్నారు.

  

రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం వారణాసి బయలుదేరి వెళ్లిన వారు.. తొలుత వారాణసీలోని అస్సీ ఘాట్‌ నుంచి దశాశ్వమేధ ఘాట్‌ వరకూ బోటులో ప్రయాణించారు. అక్కడ గంగా నదికి హారతి, గంగా పూజ నిర్వహించారు. తిరిగి అస్సీ ఘాట్‌కు వచ్చి.. ప్రాచీన సంకట్‌ మోచన్‌ హనుమాన్‌ మందిరాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Updated Date - 2021-01-29T15:06:42+05:30 IST