కారు దూకుడు..12వ రౌండ్లో టీఆర్ఎస్ 10వేల ఓట్ల ఆధిక్యం
ABN , First Publish Date - 2021-05-02T17:24:39+05:30 IST
నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. 12వ రౌండ్లో గులాబీ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతుంది...
![కారు దూకుడు..12వ రౌండ్లో టీఆర్ఎస్ 10వేల ఓట్ల ఆధిక్యం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
నల్లగొండ : నాగార్జునసాగర్ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తోంది. 12వ రౌండ్లో గులాబీ పార్టీ ఆధిక్యంతో దూసుకుపోతుంది. 10వ రౌండ్లో కాంగ్రెస్ 175 ఓట్ల ఆధిక్యం సొంతం చేసుకోగా.. మిగతా రౌండ్లలో టీఆర్ఎస్ హవా నడుస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ముందంజలో దూసుకెళ్తున్నారు. 12 రౌండ్ ముగిసేసరికి 10,361 ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. 12వ రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్కు 3,833 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,578 ఓట్లు వచ్చాయి.