ఐదేళ్లలో వాణిజ్యపన్నులు రెట్టింపు: సీఎస్
ABN , First Publish Date - 2021-03-17T08:26:26+05:30 IST
బిహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిశారు.
హైదరాబాద్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): బిహార్ ఫైనాన్స్ సర్వీసు అధికారులు మంగళవారం బి.ఆర్.కె.ఆర్. భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను కలిశారు. రాష్ట్రంలో జీఎస్టీ అమలు తీరును ఆయన వారికి వివరించారు. గత ఐదేళ్లలో వాణిజ్య పన్నులు రెట్టింపు అయ్యాయని తెలిపారు. 2018, 2020లో రెండుసార్లు వాణిజ్యపన్నుల శాఖను హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన రంగాలలో విశ్లేషణ, పరిశోధన, ఆదాయం రాగల మార్గాల గుర్తింపు కోసం ఎకనామిక్ ఇంటెలిజన్స్ వింగ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో టెక్నాలజీతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామన్నారు.