కేసీఆర్ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర: రేవంత్
ABN , First Publish Date - 2021-10-29T08:45:24+05:30 IST
కేసీఆర్ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర: రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలి ఇచ్చే కుట్ర జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని ‘సమైక్య రాష్ట్ర’ ప్రతిపాదన తేవడం కేసీఆర్-జగన్ ఉమ్మడి కుట్రగా ఆయన అభివర్ణించారు. ‘వందల మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్..!’ అని గురువారం ట్విటర్లో హెచ్చరించారు.