సూర్యాపేట ఘటన బాధాకరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN , First Publish Date - 2021-03-23T03:43:23+05:30 IST

సూర్యాపేట ఘటన బాధాకరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

సూర్యాపేట ఘటన బాధాకరం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

నల్గొండ: సూర్యాపేట ఘటన బాధాకరమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇంతమంది గాయపడడం అత్యంత శోచనీయమన్నారు. గ్యాలరీకి ఏ ప్రతిపాదికన అనుమతులు ఇచ్చారని ఉత్తమ్ ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు వైద్యసదుపాయాలు అందించాలని ఉత్తమ్ సూచించారు. 


కాగా సూర్యాపేటలో నిర్వహించిన జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్టేడియంలోని మూడో నెంబర్ గ్యాలరీ కుప్పకూలి 100 మంది యువకులకు గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా జరిగిన ఘటనతో అంతా ఉలిక్కి పడ్డారు. 47వ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైన కాసేపటికే ఈ ఘటన జరిగింది. జాతీయ క్రీడల కోసం నిర్వాహకులు స్టేడియంలో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈఘటన జరగడంతో రెయిలింగ్‌ కింద పలువురు ప్రేక్షకులు ఇరుక్కుపోయారు. స్టేడియం గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

Updated Date - 2021-03-23T03:43:23+05:30 IST