కేసీఆర్ తెలంగాణ బిడ్డేనా?: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-12-11T21:44:30+05:30 IST
సీఎం కేసీఆర్ అసలు తెలంగాణ బిడ్డేనా అని టీపీసీసీ అధ్యక్షుడు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ అసలు తెలంగాణ బిడ్డేనా అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంపై కేసీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రూ.63 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ను రూ.180 కోట్లకు పెంచినా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదన్నారు. ఈ టెండర్ను ఏపీలోని ప్రొద్దుటూరుకు చెందిన కెపీసీ కంపెనీకి ఇచ్చారన్నారు. కంపెనీకి ఎలాంటి అనుభవం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్తో పనులు అప్పగించారని ఆరోపించారు. పిడికెడు ఏపీ కాంట్రాక్టర్లు తెలంగాణని దోచుకుంటున్నారన్న కేసీఆర్ ఈ ప్రాజెక్ట్ను ఏపీ వారికే ఎందుకిచ్చారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఎవరూ అర్హులు లేరా అని ఆయన ప్రశ్నించారు.