రేపు.. 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రయాణం ఫ్రీ!

ABN , First Publish Date - 2021-12-31T08:14:38+05:30 IST

పిల్లలకు టీఎ్‌సఆర్టీసీ నూతన సంవత్సర బహుమతి ప్రకటించింది. జనవరి 1న తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12ఏళ్లలోపు పిల్లలకు టిక్కెట్‌ తీయాల్సిన అవసరం లేదని..

రేపు.. 12 ఏళ్లలోపు పిల్లలకు ప్రయాణం ఫ్రీ!

నేటి అర్ధరాత్రి ప్రత్యేక సిటీ బస్సులు: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

హైదరాబాద్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పిల్లలకు టీఎ్‌సఆర్టీసీ నూతన సంవత్సర బహుమతి ప్రకటించింది. జనవరి 1న తల్లిదండ్రులతో కలిసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే 12ఏళ్లలోపు పిల్లలకు టిక్కెట్‌ తీయాల్సిన అవసరం లేదని.. ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. ఈ వెసులుబాటు రాష్ట్రమంతా.. అన్ని రకాల ఆర్టీసీ బస్సులకూ వర్తిస్తుందన్నారు. అలాగే.. కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా.. గ్రేటర్‌ పరిధిలోని ఎంపిక చేసిన 15 రూట్లలో.. శుక్రవారం(31) అర్ధరాత్రి 12.30గంటల నుంచి శనివారం(1) తెల్లవారుజామున 3గంటల వరకూ ప్రత్యేక సిటీ బస్సు లు నడుస్తాయని ఎండీ పేర్కొన్నారు. చార్జీ 100 చెల్లించాల్సి ఉంటుందన్నారు.

Updated Date - 2021-12-31T08:14:38+05:30 IST