అన్ని విషయాలూ మాట్లాడతా: అఖిలప్రియ

ABN , First Publish Date - 2021-01-24T01:40:45+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుపై శనివారం అన్ని విషయాలు మాట్లాడుతానని మాజీమంత్రి అఖిలప్రియ ప్రకటించారు.

అన్ని విషయాలూ మాట్లాడతా: అఖిలప్రియ

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసుపై ఆదివారం అన్ని విషయాలు మాట్లాడతానని మాజీమంత్రి అఖిలప్రియ ప్రకటించారు. చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన ఆమె నేరుగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు మీడియా ముందుకు తీసుకువస్తానని చెప్పారు. బోయిన్‌పల్లి కేసులో అఖిలప్రియ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ‌ కేసులో ప్రధాన నిందితురాలు ఉన్న అఖిలప్రియకు సెషన్స్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరుచేసింది. రూ.10 వేల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ చంచల్‌గూడ జైల్లో 17 రోజులుగా రిమాండ్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. 


బోయిన్‌పల్లి కిడ్నాప్‌ ఘటన అనేక మలుపులు తిరిగింది. ఈ కేసులో ఏ1 అఖిలప్రియ ఇప్పటికే అరెస్టవ్వగా.. ఏ2 సుబ్బారెడ్డిని విచారించి, వదిలేశారు. అఖిలప్రియపై 448, 419, 341, 342, 506, 366, 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తర్వాత ఆమెపై పోలీసులు మరో రెండు సెక్షన్లు (ఐపీసీ 147, 385) జోడించారు. కిడ్నాప్‌ కేసులో ప్రాథమిక దర్యాప్తులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌కు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. భార్గవరామ్‌‌ను ఏ3గా పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2021-01-24T01:40:45+05:30 IST