టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ శుభపరిణామం: పద్మనాభరెడ్డి
ABN , First Publish Date - 2021-08-26T21:21:33+05:30 IST
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ శుభపరిణామమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ శుభపరిణామమని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. నాలుగేళ్లుగా దర్యాప్తు పేరుతో ఎక్సైజ్ పోలీసులు కేసును నీరుగార్చారని విమర్శించారు. సినీ స్టార్స్కు డ్రగ్స్ ముఠాలతో సంబంధాలున్నాయని వార్తలొచ్చాయని, ఒక్కరి పేరు కూడా ఛార్జ్షీట్లో పెట్టకపోవడం అనుమానాలకు దారితీస్తోందన్నారు. డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ నోటిసులిచ్చిందన్నారు. టాలీవుడ్లో డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, మనీ లాండరింగ్ వ్యవహారంపై.. ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నామని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.