కాటారం మండలంలో పులి కలకలం
ABN , First Publish Date - 2021-12-07T08:02:14+05:30 IST
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. శంకరంపల్లి సమీపంలోని ఏఎంసీ గోడౌన్ వద్ద
![కాటారం మండలంలో పులి కలకలం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కాటారం, డిసెంబరు 6: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. శంకరంపల్లి సమీపంలోని ఏఎంసీ గోడౌన్ వద్ద ఆదివారం రాత్రి ఓ వ్యక్తి బైక్పై వెళ్తుండగా పులి రోడ్డు దాటడంతో సర్పంచ్ అశోక్తో పాటు గ్రామస్థులకు సమాచారం అందించాడు. ఉదయాన్నే ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా పులి పాదముద్రలు కనిపించాయి. ఇదే క్రమంలో ఒడిపిల వంచ శ్మాశాన వాటిక వద్ద ఆవు దూడను పులి చంపినట్టు ఆనవాలు కనిపించాయి. ఆవుదూడ మెడపై గాయాలను బట్టి పెద్ద పులే చంపినట్లు అధికారులు నిర్ధారించారు.