ప్రజలదే ఈ విజయం: పువ్వాడ
ABN , First Publish Date - 2021-03-21T08:20:59+05:30 IST
వాణీదేవి విజయం తెలంగాణ ప్రజల విజయమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.

మార్చి 20(ఆంధ్రజ్యోతి): వాణీదేవి విజయం తెలంగాణ ప్రజల విజయమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. జాతీయ పార్టీలను తిరస్కరించిన పట్టభద్రులు, సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని ఈ ఎన్నికల ద్వారా చాటి చెప్పారని పేర్కొన్నారు. కీలక సమయంలో టీఆర్ఎస్ వెంట నిలిచిన పట్టభద్రులకు మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలిపారు.