విద్యార్థినిని అభినందించిన ప్రిన్సిపాల్
ABN , First Publish Date - 2021-01-13T04:53:25+05:30 IST
సీపీజీఈటీ-2020 ఫలితాల్లో ఎంఏ ఎకనామిక్స్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన గిరిరాజ్ కళాశాల విద్యార్థిని బొండ్ల భార్గవిని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ అభినందించారు.

నిజామాబాద్ అర్బన్, జనవరి 12: సీపీజీఈటీ-2020 ఫలితాల్లో ఎంఏ ఎకనామిక్స్లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించిన గిరిరాజ్ కళాశాల విద్యార్థిని బొండ్ల భార్గవిని కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ అభినందించారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సీపీజీఈటీ-2020 ఫలితాల్లో విద్యార్థిని భార్గవి 74 మార్కులతో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు.