కొండ దిగిన చికెన్.. కిలో రూ.150
ABN , First Publish Date - 2021-05-07T09:47:00+05:30 IST
ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో వంద రూపాయలకు పైగా కోడి మాంసం ధర తగ్గిపోయింది.
నెల వ్యవధిలో రూ.100 తగ్గుదల
మెహిదీపట్నం, మే 6 (ఆంధ్రజ్యోతి) : ఉత్పత్తి ఎక్కువగా ఉండడంతో చికెన్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. కేవలం నెల రోజుల వ్యవధిలో వంద రూపాయలకు పైగా కోడి మాంసం ధర తగ్గిపోయింది. ఏప్రిల్లో రూ.270 దాకా వెళ్లి కిలో చికెన్ ధర.. ఈనెలలో అది రూ.150కు పడిపోయింది. నగరంలో ప్రస్తుతం లైవ్కోడి ధర రూ.100 పలుకుతోంది. గత నెలలో చికెన్ ధర కిలో అత్యధికంగా రూ.270, అత్యల్పంగా రూ.220 ఉండింది. అలాగే ఈనెల ఒకటిన రూ.144, నాలుగున రూ.145, ఆరో తేదీన రూ.150 పలికింది.