మొయినాబాద్‌లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

ABN , First Publish Date - 2021-12-19T07:28:32+05:30 IST

తెలంగాణ అంతటా చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.

మొయినాబాద్‌లో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత

చలిగాలుల ఉధృతి, వణికిపోతున్న జనం

 హైదరాబాద్‌/ ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి/ హైదరాబాద్‌ సిటీ: డిసెంబరు 18:  తెలంగాణ అంతటా  చలిగాలులు ఉధృతంగా వీస్తున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఈ సీజన్‌లోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 7.1 డిగ్రీల  కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని శేరిలింగంపల్లిలో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. చలిగాలుల వల్ల రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చేందుకు జనం భయపడుతున్నారు. కాగా,  వచ్చే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే  2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్‌ తగ్గే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం సంచాలకులు చెప్పారు. 

Updated Date - 2021-12-19T07:28:32+05:30 IST