కరోనా కట్టడిలో కేంద్రం నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2021-05-05T08:40:28+05:30 IST
రెండవదశ కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి విమర్శించారు.

కరోనా సహాయ కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): రెండవదశ కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న కాలంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని ఎమ్మెల్సీ ఎ.నర్సిరెడ్డి విమర్శించారు. పరిస్థితి విషమిస్తుందని నిపుణులు హెచ్చరించినప్పటికీ కనీసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.తెలంగాణ రైతు సంఘం కార్యాలయంలో వ్యవసాయ కార్మికసంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా సహాయకకేంద్రాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. కరోనా రోగులకు కనీసం ఆక్సిజన్, వెంటిలేటర్లు అందించకపోవడంతో అనేకమంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.