పదో తరగతి విద్యార్థినికి కరోనా
ABN , First Publish Date - 2021-03-23T05:09:33+05:30 IST
పదో తరగతి విద్యార్థినికి కరోనా
![పదో తరగతి విద్యార్థినికి కరోనా](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మహదేవపూర్, మార్చి 22 : భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని కరోనా బారినపడింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమెకు సోమవారం వైద్య పరీక్ష నిర్వహించగా ఈ మేరకు నిర్ధారణ అయ్యింది. ఈ బాలికతో పాటు మరో 60 మందికి కూడా టెస్టు చేయించగా అందరికీ నెగెటివ్ అని తేలింది. విద్యార్థినికి కరోనా నిర్ధారణ కావడంతో ఉపాధ్యాయ వర్గం పాఠశాలను శానిటైజ్ చేయించింది. పాఠశాలను మాత్రం యథావిధిగా కొనసాగించారు.