తెలంగాణపై కేసీఆర్, జగన్ల ఉమ్మడి కుట్ర: రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2021-10-29T02:49:41+05:30 IST
సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ప్లీనరీలో ..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాజ్యవిస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అన్నారు. ప్లీనరీలో తెలుగుతల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్నినాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తేవడం కేసీఆర్, జగన్ల ఉమ్మడి కుట్ర కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. వందల మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడిందని, తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అని రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.