మేడారం జంపన్న వాగులో ఇద్దరు యువకుల గల్లంతు
ABN , First Publish Date - 2021-07-13T03:03:48+05:30 IST
మేడారం జంపన్న వాగులో ఇద్దరు యువకుల గల్లంతు
![మేడారం జంపన్న వాగులో ఇద్దరు యువకుల గల్లంతు](https://media.andhrajyothy.com/appimg/galleries/1921071209293682/07122021213331n29.jpg)
ములుగు: జిల్లాలోని మేడారం జంపన్న వాగు వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. ఆ వాగులో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. మణుగూరుకు చెందిన బంగారి శ్యామల్ రావు, ఉడువండి కోటేశ్వరరావుగా గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.