తెలంగాణలో 133 రైతు కుటుంబాలకు పరిహారం విడుదల
ABN , First Publish Date - 2021-12-26T04:27:45+05:30 IST
రాష్ట్రంలో పంట నష్టం, అప్పుల బాధలు తాళ్లలేక రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీరి కుటుంబాలను ఆదుకోవాలని ...
హైదరాబాద్: రాష్ట్రంలో పంట నష్టం, అప్పుల బాధలు తాళ్లలేక రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు 133 కుటుంబాలను గుర్తించింది. ఒక్కో రైతు కుటుంబానికి ఆరు లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు రూ. 7.95 కోట్లను విడుదల చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.